అందాల భామ కీర్తి సురేష్ నటించిన రీసెంట్ మూవీ ‘పెంగ్విన్’ను ఇటీవల ఓటీటీలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.కీర్తి సురేష్ మెయిన్ లీడ్లో నటించిన ఈ సినిమా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కడంతో ఈ సినిమాపై రిలీజ్కు ముందు మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ కావడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పెద్దగా సక్సెస్ కాలేదు.
ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న హీరోయిన్ కీర్తి సురేష్, సినిమా రిజల్ట్ తారుమారు కావడంతో చాలా బాధ పడుతోందట.
ఈ సినిమాతో సోలో హిట్ అందుకోవాలని చూసిన ఈ బ్యూటీ, సినిమా తేడా కొట్టడంతో తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టింది. మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ అనే సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ ఇప్పుడు ఆ సినిమాల రిజల్ట్పై కూడా ఆందోళన చెందుతోందట.
పెంగ్విన్ చిత్రం రిజల్ట్ కారణంగానే ఇప్పుడు ఆమె తన నెక్ట్స్ చిత్రాల గురించి ఆలోచనలో పడినట్లు, ఒకవేళ పెంగ్విన్ చిత్రంతో వచ్చిన నెగెటివ్ ఇంపాక్ట్ ఈ చిత్రాలపై పడితే ఎలా అని ఆమె ఆలోచిస్తుందట.
ఏదేమైనా సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ ఉంటే, గత సినిమాల ఎఫెక్ట్ ఈ సినిమాలపై ఉండబోదని పలువురు ఆమెకు సూచిస్తున్నారట.
భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలు ఏమాత్రం తేడా కొట్టిన కీర్తి సురేష్ కెరీర్ డైలమాలో పడటం ఖాయమని అంటున్నారు సినీ క్రిటిక్స్.మరి పెంగ్విన్ చిత్రం రిజల్ట్ కీర్తి కెరీర్కు ఎలాంటి మలుపును తీసుకొస్తుందో తెలియాలంటే ఆమె నెక్ట్స్ చిత్రాలు రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.