మా మూడు సినిమాలు థియేటర్‌ లోనే వస్తాయి

ఈమద్య కాలంలో ఇండియన్ సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పెన్‌ స్టూడియోస్‌.డబ్బింగ్‌ సినిమాల నుండి మొదలుకుని భారీ సినిమాల వరకు వీరు ఇండియన్ సినీ మార్కెట్‌ లో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు.

 Pen Studios Clarity About Three Films Ott Release , Pen Studios , Films Ott Rel-TeluguStop.com

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్‌ సినిమాను బాలీవుడ్‌ లో విడుదల చేయడం కోసం భారీ మొత్తంను ఇవ్వడం జరిగిందట.సినిమాకు అంత డబ్బు వచ్చినా రాకున్నా పేరు కోసం తమ బ్రాండ్‌ విలువ పెరగడం కోసం ఆయన భారీ మొత్తానికి పెద్ద సినిమాలను విడుదల చేసేందుకు హక్కులు కొనుగోలు హోల్‌ సేల్‌ గా కొనుగోలు చేయడం జరిగింది.

ప్రస్తుతం వీరి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.ఆ మూడు సినిమాలు కూడా ఓటీటీలో విడుదల అవుతాయి అనే ప్రచారం జరిగింది.

మీడియాలో వస్తున్న పుకార్లను కొట్టిపారేస్తూ డాక్టర్ జయంతి లాల్‌ గడ్డ పెన్‌ స్టూడియోస్ అధినేత ప్రెస్ నోట్‌ విడుదల చేశారు.ఆర్‌ ఆర్‌ ఆర్, గంగూభాయ్‌ మరియు ఎటాక్ సినిమాలను ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారు.అది ఏమాత్రం నిజం కాదు.అసలు ఇప్పటి వరకు తాము ఆ విషయమై ఆలోచించలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

మా సినిమాలను ఖచ్చితంగా థియేటర్‌ రిలీజ్కు ఇస్తామని కూడా ఆయన పేర్కొన్నాడు.తెలుగు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను చత్రపతితో హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు పోతున్న నిర్మాత కూడా ఈయనే అనే విషయం తెల్సిందే.ఈయన నుండి వచ్చే ఏడాది పది నుండి పదిహేను సినిమాల వరకు వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ను భారీ మొత్తానికి ఓటీటీ వారు అడుగుతున్నా కూడా మేకర్స్ మాత్రం ఆసక్తి చూపడం లేదు.

జక్కన్న థియేటర్‌ లోనే రిలీజ్ చేస్తారు.కనుక పెన్‌ స్టూడియో వారు ఓటీటీ రిలీజ్‌ కు ప్రయత్నిస్తున్నారు అనేది నిజం కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube