హైదరాబాద్ ప్రెస్ క్లబ్ బయట పవన్ పై ఆరోపణలు చేసిన తర్వాత పోసాని పై పవన్ అభిమానులు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో పోసాని పై పవన్ అభిమానులు మండిపడుతూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్ అమీర్ పేట లో నిన్న అర్ధరాత్రి పోసాని ఇంటిపై కొంతమంది దుండగులు రాళ్లతో దాడి చేయడం జరిగిందట.దాదాపు ఏడుగురు, ఎనిమిది మంది పోసాని ఇంటిపై దాడులకు పాల్పడ్డారు అని వాచ్ మెన్ తెలియజేశారు.
అంత మాత్రమే కాక పోసాని నీ విమర్శించటం తో పాటు అదే సమయంలో పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ ఆ దుండగులు నినాదాలు చేయడం జరిగిందట.దీంతో ఇంటి వాచ్ మెన్ తో పాటు కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురై వెంటనే ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఫిర్యాదు చేశారట.మరోపక్క ఎనిమిది నెలల క్రితమే పోసాని ఇల్లు మారటంతో దుండగులకు.తెలియకపోవటం మంచిది అయిందని మరి కొంతమంది అంటున్నారు.దీంతో ఇంటి ప్రాంతం దగ్గర వద్ద ఉన్న సిసి ఫుటేజీలను పరిశీలిస్తూ దుండగులను పట్టుకోవడానికి.
పోలీసులు రెడీ అయినట్లు సమాచారం.