చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కీలకమైన నాయకుడు,మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, నగిరి ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీ చైర్ పర్సన్ రోజాల మధ్య వివాదాలు తగ్గకపోగా.మరింత జఠిలమయ్యాయనే వ్యాఖ్యలు వినిపిస్తు న్నాయి.
రోజా దూకుడు పెరిగిందని, తమను కూడా లెక్కచేయడం లేదని .పెద్దిరెడ్డి వర్గం ఆది నుంచి ఆ రోపిస్తూనే ఉంది.ఈ క్రమంలోనే కుమార్వర్గాన్ని పెద్దిరెడ్డి ప్రోత్సహిస్తున్నారు.అంతేకాదు, నియోజకవర్గం లో రోజాకు కౌంటర్గా రాజకీయాలు నడుపుతున్నారు.దీంతో ఇరువురి మధ్య వివాదాలు కామన్ గా మారా యి.
ఈ విషయంలో జగన్ వరకు కొన్ని ఫిర్యాదులు కూడా వెళ్లాయి.తనకు తెలియకుండానే మంత్రులు నారా యణస్వామి, పెద్దిరెడ్డిలు పర్యటిస్తున్నారని.కనీసం ప్రొటోకాల్ కూడా పాటించడం లేదేని రోజా ఫిర్యాదు చేశారు.మరోవైపు పెద్దిరెడ్డి.నారాయణ స్వామిలు.
రోజా వ్యక్తిగత ఎజెండాతో ముందుకు సాగుతున్నారని ఆరోపిస్తున్నారు.ఇలా ఇరు పక్షాల మధ్య చిన్నపాటి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.
ఇక, ఇటీవల పేదలకు ఇళ్ల విషయంలో కూడా రోజాను మంత్రులు పక్కన పెట్టారు.
వాస్తవానికి చిత్తూరు జిల్లాలో పేదలకు ఇళ్ల లబ్ధిదారుల విషయంలో రోజా ఇచ్చిన జాబితాలో ఉన్నవారికి పెద్దగా న్యాయం జరగలేదని రోజా అనుచరులు ఆరోపిస్తున్నారు.కేవలం కొద్దిమందికి మాత్రమే రోజా సిఫారసు చేసిన వారికి ఇచ్చి.మిగిలిన వారిని పెద్దిరెడ్డి కనుసన్నల్లో ఎంపిక చేశారని రోజా మద్దతు దారులు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ప్రారంభించారు.
చిలికి చిలికి ఇదిగాలి వానగా మారే అవకాశం ఏర్పడిందని అంటున్నారు పరిశీలకులు.ప్రస్తుతానికి ఇంకా లబ్ధి దారులకు ఇళ్లను పంపిణీ చేయలేదు.
త్వరలోనే పంపణీ చేయనున్నారు.ఈ క్రమంలో తాను చేసిన సిఫారసులకు పెద్దపీట వేయాలని.
వారినే లబ్ధి దారులుగా ఎంపిక చేయాలని రోజా చెబుతున్నారు.కానీ.
అధికారులు మాత్రం పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే వ్యవహరిస్తున్నారు.దీంతో నగిరి నియోజకవర్గంలో మరోసారి పెద్ది రెడ్డి వర్సెస్ రోజా వివాదం తెరమీదికి రానుందని అంటున్నారు పరిశీలకులు.
మరి ఈ సారి ఎటు దారితీస్తుందో చూడాలి.