దేవాలయాలలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి.మూగజీవులు దేవాలయాలలో చేసేవి కొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.
మనం అందరికీ దేవాలయం ఉన్న పరిసరాలలో ఎంతో కొంత గొప్ప అదృశ్య శక్తి ఉంటుందని కొంత నమ్మకం.అదే విధంగా దేవాలయాలలోకి కొన్ని మూగజీవాలు కూడా ప్రవేశిస్తూ ఉంటాయి.
కొన్ని సార్లు అచ్చం మనుషుల వలె చేసే కొన్ని పనులు ఆ ఘటను చూసిన భక్తులకైనా, లేక ఇతర మాధ్యమాలలో చూసిన వారికైనా గొప్ప అనుభూతి కలుగుతుంది.ఇక అసలు విషయంలోకి వెళ్తే జర్మనీలోని శ్రీ వేదపీఠ నిలయంలో జరిగిన ఓ అరుదైన ఘటన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
అక్కడ ఆశ్రమంలో ఉన్న కొన్ని నెమలులు అక్కడ ఉన్న సరస్వతీదేవి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేశాయి.ఇక అరుదైన ఘటనగా భావించి దానిని ఆ ఆశ్రమ నిర్వాహకులు వీడియో తీయడంతో నెట్టింట్లో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇది నిజమా? వింతా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఇక వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లతో ఈ వీడియోను హోరెత్తిస్తున్నారు.
ఇక ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి మరి.