ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పీడీవీ ప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.పీడీవీ ప్రసాద్కు భార్య వియోగం కలిగింది.
దీంతో ఆయన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.పీడీవీ ప్రసాద్ భార్య పేరు అంజు ప్రసాద్.
ఆమెకు 53 ఏళ్లు.గత కొంతకాలంగా అనారోగ్యంతో సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది.
ఈ క్రమంలో తాజాగా గుండెపోటు రావడంతో మరణించింది.కార్డియాక్ అరెస్ట్తో ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
పీడీవీ ప్రసాద్, అంజు ప్రసాద్ దంపతులకు ఇద్దరు పిల్లలు.ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
కాగా పీడీవీ ప్రసాద్ హారిక హాసిని బ్యానర్లో ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.అలాగే సితార ఎంటర్టైన్ మెంట్ నిర్మించే సినిమాలకు సమర్పకుడిగా పీడీవీ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పీడీవీ ప్రసాద్ అందరికీ సుపరిచితమే.టాలీవుడ్లో నిర్మాతగా ఆయనకు మంచి పేరుంది.
ఆయన నిర్మాణంలో వచ్చిన చాలా సినిమాలు విజయాన్ని సాధించాయి.
పీడీవీ ప్రసాద్ కుటుంబానికి టాలీవుడ్కి చెందిన పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
అటు భార్యను కోల్పోయిన పీడీవీ ప్రసాద్కు హారిక హాసిని, సితార సంస్థలు ట్విట్టర్లో ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాయి.అటు అంజు ప్రసాద్ మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.