జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్ల పై అభ్యంతరం వ్యక్తం చేసిన పయ్యావుల కేశవ్..!!

నిన్న తాడిపత్రి మున్సిపల్ చైర్ పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా పార్టీ నేతలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.కొంతమంది నాయకులు వల్ల అనంతపురం జిల్లాల్లో బలంగా ఉన్న టిడిపి బలహీనపడుతుందని ఈ విషయంలో పార్టీ హైకమాండ్ కలుగ చేసుకోవాలని కోరారు.

 Payyavula Keshav Objected To Jc Prabhakar Reddy's Comments, Payyavula Keshav , J-TeluguStop.com

అదే రీతిలో పార్టీ కార్యకర్తలను కాపాడాలని.సూచించారు.

ఇదిలా ఉంటే మాజీమంత్రి పయ్యావుల కేశవ్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.జేసీ ప్రభాకర్ రెడ్డి కావాలని కాలవ శ్రీనివాసులు ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని… ఇది బాధాకరం అని అన్నారు.

వ్యక్తిగత విభేదాలు ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

ఇదే తరుణంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా స్పందిస్తూ కాల్వ శ్రీనివాసులు పై జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం అర్థరహితమని ఆయన వివాద రహితుడు అని పేర్కొన్నారు.

అంత మాత్రమే కాక అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి జేసీ కుటుంబం పెద్ద సమస్యగా మారిందని కాంట్రవర్సి కామెంట్లు చేశారు.జేసీ కుటుంబం కాంగ్రెస్ లో ఉన్న సమయంలో వాళ్లు చేసిన దౌర్జన్యాల విషయంలో మేము పోరాటం చేశామని.

ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు.ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని సీరియస్ కామెంట్ చేశారు.

దీంతో అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్లు పెను రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube