అనంతపురం రాజకీయాల్లో టీడీపీ పార్టీలో చెప్పుకోదగ్గ నేత పయ్యావుల కేశం.పాపం వైఎస్ఆర్ హయాంలో తెలుగుదేశం నుంచి హేమా హేమీలే ఓడిపోయిన సమయంలో సైతం ఆయన నియోజకవర్గం నుంచి ఆయన గెలిచాడు.
ఇక గత ఎన్నికల్లో పాపం గెలిచి ఉంటే మంత్రి పదవి కచ్చితంగా వచ్చి ఉండేది.కానీ టైమ్ బ్యాడ్ ఓటమిపాలై ఇంట్లో కూర్చున్నాడు.
ఇదంతా పక్కన పెడితే ఎం.ఎల్.సీ ఎన్నికలకు రంగం సిద్దం అవుతున్న తరుణంలో అధినేత మెప్పు పొందిలా అయిన ఎమ్.ఎల్.సీ గా ఎన్నికవ్వడమే కాకుండా వీలుంటే మంత్రి పదవిని సైతం సొంతం చేసుకోవాలని పావులు కదుపుతున్నారు ఆశావాహులు.అయితే ఇదే క్రమంలో జగన్ ని టార్గెట్ చేస్తూ ఆయన పై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు.
జగన్ పై పయ్యావుల మాట్లాడుతూ చంద్రబాబు పాలన రెండు ఏళ్లు మాత్రమే అన్న జగన్ మాటలకు కౌంటర్ గా చంద్రబాబు పాలన రెండేళ్లు కాదు.ఇరవై ఏళ్లు ఉంటుందని ఆయన జగన్ ను విమర్శించారు.
అంతేకాకుండా చంద్రబాబు భవిష్యత్తు చెప్పిన జ్యోతిష్కులు రెండేళ్లో జగన్ జైలు కు వెళతారని చెప్పలేదా అని ఆయన జగన్ ను ప్రశ్నించారు.ఏది ఏమైనా అధినేతకు అండగా ఉంటూనే పదవులకు ఎర వేయడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం.