టిడిపి నేత పయ్యావుల కేశవ్ తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి పై కీలక వ్యాఖ్యలు చేశారు.టీటీడీపై పీఏసి పర్యవేక్షణను.
తాను వ్యతిరేకిస్తున్నట్లు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.ప్రస్తుతం పయ్యావుల కేశవ్ పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ గానే ఉన్నారు.
ఈరోజు శ్రీవారిని దర్శించుకున్న పయ్యావుల కేశవ్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పీఏసి పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు.మత వ్యవస్థలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం ఎంతవరకు సబబు అంటూ పయ్యావుల ప్రశ్నించారు.
పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ సభ్యునిగా ఈ విషయంపై టిటిడి బోర్డు సభ్యులతో త్వరలో చర్చించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా పయ్యావుల చెప్పుకొచ్చారు.పీఏసి పరిధిలోకి మత వ్యవస్థలను ముఖ్యంగా దేవస్థానాన్ని తీసుకురావటం శ్రీవారి భక్తుడిగా కూడా విభేధిస్తున్నట్లు స్పష్టం చేశారు.ఈ విషయంపై త్వరలోనే రాష్ట్ర గవర్నర్ తో భేటీ అయి చర్చించడం జరుగుతుందని అన్నారు.శ్రీవారి పై ప్రభుత్వం యొక్క ఆధిపత్యం ఏ మాత్రం తగ్గదు అన్న తరహాలో పయ్యావుల కేశవ్.
ఈరోజు ఉదయం తిరుమల తిరుపతి లో స్పష్టం చేశారు.