ఒకప్పుడు ఏదైనా వస్తువు కొనాలి అంటే దానికి సరిపడా డబ్బులు పెట్టుకొని వెళ్లాల్సి వచ్చేది.కానీ ఇప్పుడు మాత్రం ఆ సమస్య లేదు.
కేవలం ఎకౌంట్ లో డబ్బులు ఉంటె చాలు, చెల్లింపులు చాలా ఈజీ గా చేసేవచ్చు.ఇలాంటి వాటిల్లో పేటీఎం ఒకటి బాగా ఫెమస్ అయిన విషయం తెలిసిందే.
అయితే ఈ పేటీఎం పేరెంట్ సంస్థ ఇప్పుడు భారీ నష్టాల్లో ఉన్నట్లు తెలుస్తుంది.
పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి గతంలో కంటే మూడు రెట్ల నష్టాన్ని చవి చూసింది.పేటీఎం బ్రాండ్ నిర్మాణం కోసం, వ్యాపార విస్తరణ కోసం భారీ ఎత్తున ఖర్చు చేయగా, ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ నష్టం మార్చి 31వ తేదీ నాటికి రూ.4,217.20 కోట్లకు పెరిగడం తో రోజుకు సగటున రూ.11 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తుంది.అంతకుముందు ఏడాది ఈ నష్టం రూ.1,604.34 కోట్లుగా ఉండగా, ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది.
ఈ కంపెనీ తన వ్యాపారాన్ని విస్తృతం చేసుకునేందుకు, బ్రాండ్ను డెవలప్ చేసుకునేందుకు భారీ మూలధనం ఇన్వెస్ట్ చేసిందని, వివిధ మూలధన, కార్యాచరణ వ్యయాల్లో గణనీయమైన మొత్తాలను తాము కలిగి ఉన్నామని, దీని ఫలితంగా ఆర్థిక సంవత్సరంలో నష్టాలు సంభవించాయని కంపెనీ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.