పేమెంట్ బ్యాంక్ కస్టమర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది ఆర్బీఐ.కరోనా టైం లో డిజిటల్ పేమెంట్స్ కు అనుగుణంగా పేమెంట్స్ బ్యాంకులు చాలా సౌకర్యవంతంగా పనిచేశాయి.
డిజిటల్ ఇండియాలో భాగంగా నగదు బదిలీ, విత్ డ్రాయల్ అంతా డిజిటల్ మయం కావాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన.ఇక ఈ క్రమంలో డిజిటల్ పేమెంట్స్ పేమెంట్స్ బ్యాంక్ ల ద్వారా చేసే వారికి ఇన్నాళ్లు లిమిట్ అనేది పెట్టారు.
మొన్నటివరకు కేవలం పేమెంట్ బ్యాంక్ ల నుండి 1 లక్ష రూపాయల వరకే పేమెంట్స్ జరిగే అవకాశం ఉండేది.
అయితే దీనిపై ఆర్బీఐ వెసులుబాటు ఏర్పాటు చేసింది.మొన్నటివరకు లక్ష మాత్రమే పేమెంట్స్ బ్యాంక్ ల ద్వారా లిమిట్ పెట్టిన ఆర్బీఐ దాన్ని ఇప్పుడు 2 లక్షలు చేసింది.2 లక్షల వరకు పేమెంట్స్ బ్యాంక్ ల ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చని ఆర్బీఐ వెల్లడించింది.ఇది చాలమంది డిజిటల్ పేమెంట్ కస్టమర్స్ కు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు. దేశంలో డిజిటల్ పేమెంట్స్ కు మరింత కట్టుదిట్టమైన సెక్యురిటీ ఏర్పాటు చేస్తూ లిమిట్ కూడా పెంచడంతో ఇక మీదట అందరు డిజిటల్ పేమెంట్స్ కే ఎక్కువ వినియోగించేలా చేస్తున్నారు.
ఈ డిజిటల్ పేమెంట్స్ వల్ల కరోనాని కొంతమేరకు కట్టడి చేయొచ్చని వారి ఆలోచన.