ఆర్ఎక్స్ 100 సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.ఈమె ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తూ ఉంటుంది.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తెలుగు రాష్ట్రాల యూత్ ను తెగ ఆకట్టుకుంటోంది ఈ భామ.అయితే ఆర్ఎక్స్ 100 లాంటి బోల్డ్ క్యారెక్టర్స్ లభించకపోవడంతో ఈ భామ కాస్త వెనుకపడినట్టు అయింది.ఇకపోతే ప్రస్తుతం తన చేతిలో సినిమాలు కాస్త తక్కువగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం రోజురోజుకీ పాపులారిటీని పెంచుకుంటూ వెళుతుంది.
తెర పై ఎలాంటి రచ్చ చేస్తుందో అచ్చం అలాగే సోషల్ మీడియాలో కూడా తెగ హల్ చల్ చేస్తోంది.
ఈ మధ్య కాలంలోనే తన మకాం ను పూర్తిగా హైదరాబాద్ కు మార్చేసింది పాయల్ రాజ్ పుత్.తనకు సంబంధించిన సినిమా ప్రాజెక్టులు ఎక్కువగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఉండడం కారణంతో హైదరాబాద్ లోనే సొంత ఇళ్లు కొనుగోలు చేసింది.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కోసం అని సరదాగా రోడ్లపై ఫోటో షూట్ చేసి కాస్త హడావిడి చేసింది.ఆ తర్వాత మళ్లీ కరోనా వైరస్ పరీక్షల నేపథ్యంలో భాగంగా ఓ చిన్నపిల్లల ఏడవడం లాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త బాగా పాపులర్ అయ్యాయి.
అయితే ఆ ఫోటోకి సంబంధించి చిన్నపిల్లలా ఏడవడం ఏంటి అంటూ.నెటిజెన్స్ ఆమెపై కొన్ని సెటైర్లు వేశారు.అయితే ఇలా తనని ట్రోల్ చేయడంతో కాస్త బాధతో తనను ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారా…? ఇది ఏం న్యాయం అంటూ ఫ్యాన్స్ పై కాస్త అసహనం వ్యక్తం చేసింది.
ఇకపోతే ప్రస్తుతం పాయల్ ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.
ఆ సినిమాలో పాయల్ ఓ పక్క పల్లెటూరి అమ్మాయిలా ఓ పాత్రను చేస్తుంది.పైగా ఆ పాత్రలో పూర్తిగా తెలంగాణ యాసలో మాట్లాడుతున్నట్లు సమాచారం.
అయితే తాజాగా ఆ పాత్రకు సంబంధించి మేకప్ రూమ్ లో రెడీ అవుతున్న సమయంలో తీసుకున్న ఫోటోను షేర్ చేసింది.అయితే అందులో తన ముఖం మాత్రం కనిపించకుండా ఉండేలా ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇక ఈ ఫోటోలో తన మొహాన్ని మాత్రం చూపించను అంటూ లుక్ బయటకు పడకుండా జాగ్రత్త పడింది.