తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు నిలిచి పోతాయి.అలాంటి చిత్రాల్లో అరుంధతి ఒక చిత్రం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ నిర్మించిన అరుంధతి చిత్రంలో అనుష్క నటించిన విషయం తెల్సిందే.అద్బుత చిత్రాల్లో ఒకటిగా ఈ చిత్రానికి పేరు ఉంది.
ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు టీవీలో వస్తుందా అంటూ ప్రేక్షకులు ప్రతి రోజు ఎదురు చూస్తూనే ఉంటారు.థియేటర్లలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న అరుంధతి బుల్లి తెరపై కూడా ఇంకా ఆకట్టుకుంటూనే ఉంది.
ఈ సమయంలోనే అరుంధతి కి సీక్వెల్ రాబోతుందట.అనుష్క పోషించిన అరుంధతి పాత్రను పాయల్ రాజ్పూత్ పోషించేందుకు సిద్దం అవుతోంది.గత కొన్ని వారాలుగా హాలీవుడ్ స్టంట్స్ మాస్టర్ వద్ద పాయల్ రాజ్ పూత్ ఈ చిత్రం కోసం ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి ఈ చిత్రం ఆ అరుంధతి రేంజ్లోనే తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే ఈ సీక్వెల్కు అప్పటి చిత్ర నిర్మాతకు మరియు ఇతర టెక్నీషియన్స్కు సంబంధం లేదు.
అరుంధతి చిత్రానికి సీక్వెల్ను మల్లెమాల అధినేత శ్యామ్ ప్రసాద్ నిర్మిస్తే అందరి దృష్టి ఈ చిత్రంపై ఉండేది.
తప్పకుండా అరుంధతి 2 మరో అద్బుత చిత్రంగా నిలిచేది.కాని ఇప్పుడు నిర్మించేది కొత్త నిర్మాత.
అందుకే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపే అవకాశం లేదు.సినిమా ఏదైనా అద్బుతం జరిగి సక్సెస్ అయితే అప్పుడు అరుంధతి 2 గురించి మాట్లాడుకునే అవకాశం ఉంది.
అప్పటి వరకు అరుంధతి 2 గురించి ఎంతగా మీడియాలో వార్తలు వచ్చినా కూడా జనాలు ఆసక్తి చూపించరని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.