ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఓవర్నైట్ గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ పాయల్ రాజ్పుత్, ఇప్పటికే టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.హాట్ అందాలతో కుర్రకారును ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ఆర్ఎక్స్ 100 చిత్రంతో వచ్చిన ఈ క్రేజ్ను పూర్తిగా ఉపయోగించుకోవాలని చూసింది.
కానీ అమ్మడుకి ఎందుకో అదృష్టం కలిసి రాలేదు.దీంతో ఈ బ్యూటీ వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలని చూస్తోంది.
ఇందులో భాగంగా టాలీవుడ్లో వస్తున్న ప్రతి ఆఫర్ను చేస్తూ వస్తోంది.
ఈ క్రమంలో అమ్మడుకి మిగతా భాషల్లో కంటే కూడా తెలుగులోనే ఎక్కువ ఆఫర్లు వస్తుండటంతో తరుచూ ముంబై నుండి హైదరాబాద్కు ప్రయాణం చేస్తూ బిజీగా ఉంది.
ఈ క్రమంలో అమ్మడు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.తరుచూ ముంబై నుండి ఇక్కడికి రావడం కష్టంగా ఉండటంతో అమ్మడు హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వాలని చూస్తోంది.ఇందులో భాగంగా హైదరాబాద్లో పాయల్ ఓ ఇల్లును కొనేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
తన తల్లిదండ్రులతో కలిసి ఆమె హైదరాబాద్కు మకాం మార్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు తనకు అనువుగా ఉండే ఫ్లాట్ను వెతుకుతోందట ఈ బ్యూటీ.హైదరాబాద్ నగరం తనకు ఎంతో నచ్చిందని, తనకు రెండో ఇల్లుగా ఇక్కడే సెటిల్ అవుతానని గతంలోనే వెల్లడించిన ఈ బ్యూటీ, ఇప్పుడు అదే పనిలో పడినట్లు తెలుస్తోంది.
నచ్చిన ఇల్లు దొరకగానే తన తల్లిదండ్రులతో సహా ఇక్కడే సెటిల్ అవ్వాలని ఈ బ్యూటీ చూస్తోంది.ఇక సినిమాల పరంగా తెలుగులో ‘నరేంద్ర’ అనే సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇకనైనా తనకు మంచి గుర్తింపు రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.మరి ఈ సినిమాతోనైనా పాయల్ రాజ్పుత్కు ఓ మంచి బ్రేక్ వస్తుందేమో చూడాలి.