సుశాంత్ ఆత్మహత్య ఘటన రోజు రోజుకి మరింత వివాదాస్పదంగా మారుతుంది.ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతూ అతను కేవలం డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడు అని నిర్ధారించిన కూడా చాలా మంది సెలబ్రిటీలు దానిని విశ్వసించడంలేదు.
సుశాంత్ మరణం వెనుక ఏదో మిస్టరీ దాగి ఉందని చెబుతున్నారు.ఈ విషయంలో రాజకీయ ప్రముఖులు కూడా గొంతు కలుపుతున్నారు.
తాజాగా సౌత్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ సుశాంత్ గురించి ఓ వివాదాస్పద కథనాన్ని షేర్ చేసింది.ఆమె చేసిన కథనం ఇప్పుడు మరింత వివాదంగా మారింది.
సుశాంత్ ను సల్మాన్ ఖాన్, సూరజ్ పంచోలీ కలిసి హత్య చేశారనే ఈ కథ సారాంశం.సుశాంత్ మేనేజర్ దిశ, సూరజ్ పంచోలీ చాలా క్లోజ్.సూరజ్ వల్ల దిశ గర్భవతి అయిందట.విషయం తెలుసుకున్న సూరజ్, దిశను చంపేశాడట.
సూరజ్-దిశ ఎఫైర్ గురించి కేవలం సుశాంత్ కు మాత్రమే తెలుసట.దీంతో దిశ మరణం తర్వాత సుశాంత్, సూరజ్ కు వ్యతిరేకంగా చాలా గట్టిగా ఫైట్ చేశాడట.
కొన్ని ఆధారాలు కూడా సేకరించాడని చెబుతారు.ఈ క్రమంలో మరోసారి సల్మాన్ సహకారంతో సూరజ్, సుశాంత్ పై కక్షకట్టిసల్మాన్, సూరజ్ తో పాటు మహేష్ భట్, అండర్ వరల్డ్, కొన్ని రాజకీయ పార్టీలు కలిసి సుశాంత్ ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారనేది ఈ వివాదాస్పద పోస్ట్ సారాంశం.
పాయల్ రాజ్ పుత్ ఈ పోస్ట్ షేర్ చేయడం ద్వారా సుశాంత్ మరణంపై మరిన్ని అనుమానాలు పెరిగేలా చేసింది.దీనిపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడాలి.
.