ఆర్ఎక్స్ 100తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ లో సక్సెస్ ట్రాక్ ఎక్కి స్టార్ హీరోయిన్ అవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.ఈ భామకి అవకాశాలు బాగానే ఉన్నాకూడా పెద్ద హీరోల పక్కన ఛాన్స్ లు రావడం లేదు.
సోలోగా లేడీ ఒరియాంటెడ్ కథలు చేసే అవకాశం వస్తుంది.ప్రస్తుతం ఈ అమ్మడు పోలీస్ ఆఫీసర్ గా ఓ సినిమా చేస్తుంది.
ఈ సినిమా షూటింగ్ కోసం పాయల్ ముంబై నుంచి హైదరాబాద్ లో అడుగు పెట్టింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆమె కొత్త సినిమా షూటింగ్ జరుగుతుంది.
ఈ సందర్భంగా షూటింగ్ లో పాల్గొనడానికి వెళ్లిన ఆమెకి కరోనా టెస్ట్ నిర్వహించారు.ఇక ఈ టెస్ట్ చేస్తున్న సమయంలో పాయల్ రాజ్ పుత్ ఏడవడం జరిగింది.
అత్యుత్సాహం కొద్ది ఆ వీడియోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే కోవిడ్ టెస్ట్ చేస్తున్న సమయంలో ఆమె అలా భయపడిన ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రోల్స్ క్రియేట్ చేయడం మొదలు పెట్టారు.
ఆమెని రకరకాల మీమ్స్ తో ట్రోల్స్ చేస్తున్నారు.అయితే సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోల్స్ పై పాయల్ రాజ్ పుత్ కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
తనకి చిన్న వయస్సు నుంచి ఇంజక్షన్, ట్యాబ్లేట్స్, మెడికల్ టెస్ట్ లు అంటే విపరీతమైన భయం అని, ఆ కారణంగానే కోవిడ్ టెస్ట్ చేసినపుడు భయపడ్డా అని చెప్పింది.ఈ చిన్న విషయంపై అంతగా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది.
అనవసరంగా తనని అదే పనిగా ప్రతి విషయంలో ట్రోల్ చేస్తున్నారు అంటూ నెటిజన్లు మీద సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.ఆమె చెప్పినట్లే పాయల్ రాజ్ పుత్ ఏం చేసినా సోషల్ మీడియాలో నెటిజన్లు అదే పనిగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.
ఈ కారణంగానే ఈ విషయంపై ఈ భామ సీరియస్ గా రియాక్ట్ అయినట్లు తెలుస్తుంది.