స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు.కాగా ఈ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.కాగా ఈ సినిమాలో బన్నీ పాత్ర చాలా రఫ్గా ఉండనుండటంతో ఈ సినిమా మస్ వర్గాలను ఖచ్చితంగా అలరించేందుకు రెడీ అవుతోంది.
ఇక ఈ సినిమాలో మాస్ ప్రేక్షకులను అలరించేందుకు ఓ మాస్ సాంగ్ను పెట్టాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు.గతంలో రంగస్థలం చిత్రంలో ‘జిగేలు రాణి’ అనే పాటతో మాస్ను ఉర్రూతలూగించిన సుకుమార్, ఇప్పుడు అలాంటి పాటనే పుష్ప చిత్రంలోనూ పెట్టాలని చూస్తున్నాడు.
అయితే ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేశాడు.కానీ ఆమె భారీగా డిమాండ్ చేస్తుండటంతో ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ, ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్పుత్ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
సుకుమార్ చిత్రం కావడంతో ఆమె కూడా ఈ సినిమాలో చిందులు వేసేందుకు రెడీ అయ్యిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వార్తలపై పాయల్ రాజ్పుత్ తాజాగా క్లారిటీ ఇచ్చింది.
ఈ సినిమాలో తాను ఎలాంటి ఐటెం సాంగ్ చేయడం లేదని పాయల్ తేల్చి చెప్పేసింది.దీంతో ఈ సినిమాలో ఐటెం సాంగ్లో ఎవరు చేస్తారా అనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
మరి ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.