సర్కారు వారి పాట తర్వాత సూపర్ స్టార్ మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుందని టాక్.
అయితే సినిమాలో సెకండ్ హీరోయిన్ కు ఛాన్స్ ఉండగా ఆ ఛాన్స్ ఆరెక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ అందుకున్నట్టు తెలుస్తుంది.ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ ఆ క్రేజ్ తో వరుస ఆఫర్లు అందుకుంది.
అయితే ఆరెక్స్ 100 సినిమా తెచ్చినంత పాపులారిటీ మరే సినిమా తీసుకురాలేదని చెప్పొచ్చు.అందుకే అమ్మడు తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలని చూస్తుంది.
ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రం కాంబినేషన్ లో సినిమా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ సెకండ్ హీరోయిన్ ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది.
పాయల్ రాజ్ పుత్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ రావడం ఇదే మొదటిసారి.సీనియర్ హీరో వెంకటేష్ తో నటించినా ఆమె కెరియర్ కు ఏమాత్రం క్రేజ్ తీసుకురాలేదు.
మహేష్ సినిమాతో అయినా పాయల్ తన ఫేట్ మార్చుకుంటుందో లేదో చూడాలి. పాయల్ సినిమాలో ఉంది అంటే తప్పకుండా సినిమాలో అమ్మడు గ్లామర్ తో ఆకట్టుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.