ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్.మొదటి సినిమాతోనే అటు బోల్డ్ నెస్ తో, ఇటు పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసిన ఈ అమ్మడు తరువాత వరుస అవకాశాలని అందుకుంది.స్టార్ హీరోలైనా వెంకీ, రవితేజతో కూడా ఆడిపాడింది.అయితే మొదటి సినిమా తర్వాత ఆమె చేసిన సినిమాలలో చాలా వరకు డిజాస్టర్ అయ్యాయి.వెంకీ మామ హిట్ అయినా క్రెడిట్ రాలేదు.దీంతో స్టార్ హీరోలకి జోడీగా నటించే అవకాశాలు దక్కడం లేదు.
అయినా కూడా నటిగా మాత్రం సోలోగా ఫీమేల్ సెంట్రిక్ కథలతో పాయల్ రాజ్ పుత్ దూసుకుపోతుంది.ప్రస్తుతం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఒక సినిమా చేస్తుంది.
ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది.దీంతో సాలిడ్ హిట్ ని ఖాతాలో వేసుకొని మళ్ళీ కమర్షియల్ హీరోయిన్ గా లేదంటే ఫీమేల్ సెంట్రిక్ కథలకి కేరాఫ్ గా మారాలని పాయల్ భావిస్తుంది.
ఇక లాక్ డౌన్ టైం లో అనగనగా ఒక అతిథి అనే వెబ్ మూవీతో పాయల్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో పాయల్ పెర్ఫార్మెన్స్ ఇరగదీసింది.
అయితే కంటెంట్ ఎవరికీ పెద్దగా కనెక్ట్ కాకపోవడంతో అనుకున్న స్థాయిలో ఫోకస్ కాలేదు.ఇప్పుడు మరోసారి వెబ్ మూవీకి పాయల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మధ్యకాలంలో అందాల భామలు అందరూ వెబ్ కంటెంట్ వైపు ఎక్కువగా దృష్టిపెడుతున్నారు.వెబ్ మూవీస్, వెబ్ సిరీస్ లలో ఎంట్రీ ఇస్తున్నారు.
ఈ నేపధ్యంలో తన కెరియర్ కి కూడా ఎలాంటి ఢోకా ఉండకుండా ముందుగానే వెబ్ మూవీస్ కి పాయల్ ఒకే చెబుతుంది.వీటి ద్వారా డిఫరెంట్ కంటెంట్ ట్రై చేయొచ్చని భావిస్తుంది.
ఈ నేపధ్యంలోనే అవినాశ్ కోకాటి చెప్పిన కథ నచ్చడంతో ఈ చిన్నది ఈ ప్రాజక్టుకు ఒప్పుకుందట.త్వరలో ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది.