ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటిస్తున్నాడు.అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి మొదటి షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తి చేసినట్లు ఇటీవలే దర్శకుడు బోయపాటి శ్రీను అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు.
అయితే తే షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ ఈ చిత్రంలో బాలయ్య బాబు సరసన నటించే హీరోయిన్ల విషయంలో మాత్రం ఇప్పటి వరకు సరైన స్పష్టత లేదు.దీంతో ఈ విషయంపై నెట్టింట్లో పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఇందులో భాగంగా ఇటీవల మంచి టాలీవుడ్లో మంచి ఫామ్ లో ఉన్నటువంటి హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ని బాలయ్య బాబు సరసన నటించేందుకు సంప్రదించినట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాక ఈచిత్రంలో ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార మరియు టాలీవుడ్ తెలుగు అందం అంజలి ని కూడా తీసుకున్నట్లు ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి.
కానీ ఈ వార్తలపై దర్శకుడు బోయపాటి శ్రీను ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.అయితే గ్లామర్ విషయంలో అసలు రాజీపడనటువంటి పాయల్ రాజ్ పుత్ ఈ చిత్రానికి కలిసి వచ్చే అంశమని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బాలయ్య యాక్షన్ కి పాయల్ గ్లామర్ తోడైతే బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో నటించినటువంటి పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాయం పాలవుతున్నాయి.దీంతో బాలయ్య బాబు ఈ సారి బోయపాటితో ఎలాగైనా హిట్ కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు.అయితే ఈ చిత్రంలో బాలయ్య బాబు కొన్ని సన్నివేశాలలో పాత్రలో అఘోరా గా కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికోసం ఇప్పటికే వారణాసిలో చిత్రీకరణ కూడా పూర్తి చేసినట్లు సమాచారం.