టాలీవుడ్లో ఒకే ఒక్క సినిమాతో తనకంటూ ప్రత్యేక క్రేజ్ను సంపాదించుకున్న భామ పాయల్ రాజ్పుత్, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.ఇక ఈ బ్యూటీ ఇప్పటివరకు తన ఫస్ట్ మూవీ ఆర్ఎక్స్ 100 మార్క్ నుండి బయటపడకపోవడంతో, ఆమె విభిన్న చిత్రాల్లో నటించేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఓ థ్రిల్లర్ మూవీలో నటించేందుకు రెడీ అయ్యింది.ఈ సినిమాకు ‘కిరాతక’ అనే ఆసక్తికర టైటిల్ ఉండటంతో ఈ సినిమాపై ఆమె భారీ అంచనాలు పెట్టుకుంది.
అయితే ఈ సినిమాలో పాయల్ పాత్ర ఎలా ఉండబోతుందా అనే విషయంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.కాగా ఈ సినిమాలో ఆమె లీడ్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో పాయల్ పాత్ర ఆమె కెరీర్కు మంచి బూస్ట్ ఇవ్వడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.ఈ సినిమాలో పాయల్తో పాటు ఆది సాయి కుమార్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై చిత్ర వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
ఇక ఈ సినిమాను పూర్తి థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోండగా, ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
చుట్టాలబ్బాయి చిత్ర దర్శకుడు వీరభద్రం ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అనే ఆసక్తి చిత్ర వర్గా్ల్లో నెలకొంది.
ఇక ఈ సినిమాను నాగం తిరుపతి రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.మరి ‘కిరాతక’ చిత్రంలో పాయల్ రాజ్పుత్ ఎలాంటి పాత్రలో నటిస్తుందో, ఆమె పాత్ర ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు ఆమె అభిమానులు.
ఏదేమైనా ఈ సినిమాతో ఆర్ఎక్స్ మార్క్ను పూర్తిగా పోగొట్టుకునేందుకు పాయల్ ప్రయత్నిస్తుంది.మరి ఆమె ఎంతమేర సక్సెస్ అవుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.