టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన సినిమాలు సక్సెస్ కావడంతో లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్లు చాలామందే ఉన్నారు.ఈ స్టార్ హీరోయిన్లలో మెజారిటీ హీరోయిన్లు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లే.
వీళ్లు ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలే అయినా ఒక్క సినిమాలో కూడా వీళ్లు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోరు.మరి కొందరు హీరోయిన్లు అయితే తెలుగు నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు.
ఒకరిద్దరు స్టార్ హీరోయిన్లు తమ సినిమాలకు డబ్బింగ్ చెప్పుకున్నా మిగతా హీరోయిన్లు అంతా డబ్బింగ్ చెప్పడానికి అసలు ఆసక్తి చూపడం లేదు.ఇంటర్వ్యూలో డబ్బింగ్ గురించి ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నామని భవిష్యత్తులో డబ్బింగ్ చెబుతామని మాటలు చెబుతూ ఉంటారు.అయితే యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్లు అనిపించుకుంటున్న వాళ్ల కంటే తనే గ్రేట్ అని ప్రూవ్ చేసుకుంది.
2018 సంవత్సరంలో ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్టైనా, ఆమె నటనకు ప్రశంసలు దక్కినా ఆ సినిమా ద్వారా వచ్చిన బోల్డ్ ఇమేజ్ పాయల్ కు మైనస్ గా మారింది.ఆ తరువాత పాయల్ పలు సినిమాల్లో నటించినా పాత్రచిత్రణ సరిగా లేకపోవడం వల్ల ప్రతిభ ఉన్నా స్టార్ హీరోయిన్ గా పాయల్ కు గుర్తింపు మాత్రం దక్కలేదు.
పంజాబీ భామ అయిన పాయల్ హైదరాబాద్ పోలీసులు ప్లాస్మా దానం గురించి అవగాహన ప్రజల్లో పెంపొందించడం కోసం చేసిన ఒక షార్ట్ ఫిలింలో పాయల్ పోలీస్ హెల్ప్ లైన్ సహాయం తీసుకుని తాను ప్లాస్మా దానం చేయడానికి వచ్చానని.ప్లాస్మా దానం చేస్తే ఏమైనా అవుతుందా.? అని ప్రశ్నించే పాత్రలో నటించి తన గొంతును వినిపించింది.భవిష్యత్తులో పాయల్ నటించే సినిమాల్లో ఆమె సొంత గొంతునే వినిపిస్తుందేమో చూడాలి.