తెలుగు సినీ ప్రేక్షకులకు ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ ముద్దుగుమ్మ అందానికి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ముందు మనందరికీ తెలిసిందే.
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించుకుంది.ఇకపోతే పాయల్ రాజ్ పుత్ సినిమాలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.
ఇక పాయల్ అందాల ఆరబోతకు కుర్ర కారు ఫిదా అవుతూ ఉంటారు.అప్పుడప్పుడు పాయల్ రాజ్ పుత్ అందాల ప్రదర్శన చూసి జనాలు ముక్కున వేలేసుకుంటూ ఉంటారు.
ఈ అందాలకు ప్రదర్శనలో భాగంగా అప్పుడప్పుడు ఈమె ట్రోలింగ్స్ ని కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.
ఇకపోతే పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం వరస సినిమా అవకాశాలతో బిజీ బిజీగా ఉంది.
ఇకపోతే ఆది సాయికుమార్ తాజాగా నటించిన తీస్ మార్ ఖాన్ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా పాయల్ రాజ్ పుత్, ఆది సాయికుమార్ ఇద్దరు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్నారు.
ఇక హైపర్ ఆది అయితే పాయల్ రాజ్ పుత్ ఎంట్రీ ఇవ్వగానే మొఖం అంతా ఒకలాగా పెట్టారు.
అంతేకాకుండా పాయల్ ముద్దుల కోసం పాకులాడాడు.నరేష్ అంటే అందరూ చిన్న పిల్లాడిలానే చూస్తారు.22 ఏళ్లు వచ్చినా కూడా నరేష్ను అంతగా పట్టించుకోరు.అయితే పాయల్ రాజ్ పుత్ ను ఫ్లర్ట్ చేసేందుకు నరేష్ ప్రయత్నిస్తాడు.ఇక పాయల్ సైతం నరేష్ చెంపకు ముద్దు పెట్టినట్టు అలా ముద్దు పెట్టేసింది.దీంతో ఆది రెచ్చిపోయి అలాంటిదే నాకు కూడా ఒకటి ఇవ్వు అన్నట్టుగా ముందుకు వచ్చాడు.ఇక పాయల్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.
నరేష్ చెంపకు తన చెంప ఆనిచ్చినట్టు ఆది చెంపకు కూడా ఆనిచ్చింది.అయితే ఆ వెంటనే బ్రదర్ అనేసింది.
దీంతో ఆది ఆవేశం, ఆశలు అన్నీ చల్లారిపోయినట్టున్నాయి.