టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతో బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.దీంతో వెంకటేష్, రవితేజతో సినిమాలు చేసే అవకాశం సొంతం చేసుకున్న కూడా ఆమెకి మొదటి సినిమా స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు.
స్టార్ హీరోల చిత్రాలలో ఆమెని చిన్న పాత్రలకే పరిమితం చేశారు.ఈ విషయంలో పాయల్ కొంత హార్ట్ అయ్యింది.
అయితే ఆర్డీఎక్స్ సినిమాతో మరోసారి బోల్డ్ అందాలని నమ్ముకొని రెచ్చిపోయింది.కాని సినిమా మాత్రం తేలిపోయింది.
ఈ సారి పాయల్ రాజ్ పుత్ కాస్తా రూట్ మార్చింది.మొదటిసారి పాయల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో యాక్షన్ ఇరగాదీయడానికి రెడీ అవుతుంది.ఈ సినిమాతో గుణశేఖర్ శిష్యుడు ప్రణదీప్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.కైవల్య క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
మర్డర్ మిస్టరీగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని మార్చి 4న ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ సినిమా మేగ్జిమం షూటింగ్ పూర్తయిపోయిందని దర్శకుడు తెలిపారు.ఇక ఈ సినిమాలో పాయల్ సరికొత్తగా కనిపిస్తుందని తెలిపారు.
వేసవిలో ఈ సినిమా రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.