సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాని పరశురాం దర్శకత్వంలో ప్లాన్ చేసుకున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకి అంతా సిద్ధం అయిపొయింది.
స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది.ఈ నెలాఖరులో సినిమా ముహూర్తం షాట్ తో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి ప్రతినాయక పాత్ర చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇక హీరోయిన్స్ కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మల పేర్లు పరిశీలిస్తున్నారు.
పరశురాం స్టైల్ లో సాగే ఫ్యామిలీ ఎలిమెంట్స్ తోనే ఈ సినిమా ఉండనుంది.ఇక ఇందులో మరోసారి మహేష్ బాబు కాలేజీ స్టూడెంట్ గా నటించబోతున్నాడు.
ఇదిలా ఉంటే ఇందులో ఒక ఐటెం సాంగ్ కోసం దర్శకుడు పరశురాం చాలా మంది పేర్లు పరిశీలించి ఫైనల్ గా ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ ని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.హీరోయిన్ గా సాలిడ్ హీరియర్ ని బిల్డ్ చేసుకోలేక సతమతం అవుతున్న పాయల్ రాజ్ పుత్ కి ఇది మంచి అవకాశం అని చెప్పాలి.
అలాగే ఈ సాంగ్ కోసం అమ్మడుకి భారీగానే ముట్టజెప్పినట్లు తెలుస్తుంది.ఏది ఏమైనా మహేష్ తో స్టెప్పులు వేసే ఆకాశం సొంతం చేసుకోవడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.
అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు ఈ వార్తపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.