ఉన్నమాటే అన్నాను.. ఆమెకు క్షమాపణ చెప్పేది లేదన్న ఎన్టీఆర్‌ హీరోయిన్‌

ఎన్టీఆర్‌ ఊరసవెల్లి సినిమాతో పాటు మంచు మనోజ్‌ తో ఒక సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన పాయల్‌ ఘోష్‌ ఈమద్య కాలంలో జాతీయ మీడియాలో ప్రధాన వార్త అయ్యింది.బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనను లైంగికంగా వేదించాడు అంటూ ఆరోపించిన విషయం తెల్సిందే.

 Payal Ghosh Refuses To Say Sorry To Riccha Chadda  Ntr, Usaravelli, Payal Gosh,-TeluguStop.com

ఆ విషయమై ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.అనురాగ్‌ కశ్యప్‌ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సమయంలో రిచా చద్దా పేరు ప్రస్తావించాడు.

తనకు రిచాతో మంచి పరిచయం ఉందని తనకు ఆమె అత్యంత సన్నిహితంగా ఉంటుందని కూడా నాతో అన్నాడు అంటూ పాయల్‌ ఘోష్‌ వ్యాఖ్యలు చేసింది.మీటూ వ్యవహారంలో పాయల్‌ తన పేరును ప్రస్థావించడంపై 1.1 కోట్ల రూపాయల పరువు నష్టం దావాను హీరోయిన్‌ రిచా చద్దా వేసింది.ఆ విషయమై పాయల్‌ మొదట క్షమాపణలు చెప్పేందుకు ఓకే చెప్పినా ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ నేను ఉన్నమాట అన్నాను.

అనురాగ్‌ నాతో ఏదైతే అన్నాడో అదే నేను అన్నాను.అంతకు మించి ఏమీ మాట్లాడలేదు.ఇందుకు నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి అంటూ పాయల్‌ ఘోష్‌ ప్రశ్నించింది.బాంబే హైకోర్టులో తనపై రిచా వేసిన పరువు నష్టందావాకు తాను సమాధానం చెబుతాను అంటూ పాయల్‌ పేర్కొంది.

ఆ విషయంను తాను నిరూపించేందుకు సిద్దంగా ఉన్నాను.ఎట్టి పరిస్థితుల్లో సారీ చెప్పను అంటూ తన నిర్ణయంను మార్చుకుంది.

ఈ విషయంలో ఆమె తీసుకున్న అనూహ్య నిర్ణయం వెనుక ఉన్నది ఎవరు అనే విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికే పాయల్‌ ఘోష్‌ గురించి జాతీయ మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి.

ఆమె పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుందేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ఈ పరువు నష్టం దావాతో ఆమె మరింతగా వార్తల్లో నిలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube