బాలీవుడ్ లో ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ ట్రెండింగ్ లో ఉంటుంది.డ్రగ్స్ మాఫియా, నెపోటిజం, లైంగిక వేధింపుల పర్వం చర్చనీయాంశాలుగా మారిపోయాయి.
మీటూ పేరుతో చాలా మంది బాలీవుడ్ విమెన్ సెలబ్రెటీలు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై మీడియా ద్వారా ప్రస్తావించారు.తనుశ్రీ దత్తా ఆరంభంలో బాలీవుడ్ లో మీటూ చర్చకి తెరతీసింది.
అయితే అది అంతా సైలెంట్ అయిపోయింది అనుకున్న సమయంలో తాజాగా పాయల్ ఘోష్ మరోసారి ఈ మీటూ చర్చని తెరపైకి తీసుకొచ్చింది.ఆమె బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మీద తీవ్ర ఆరోపణలు చేసింది.
తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు బలవంతం చేయబోయాడని మీడియాలో ప్రస్తావించింది.అలాగే అనురాగ్ తో కొంత మంది హీరోయిన్స్ కి సంబంధాలు ఉన్నాయని ముగ్గురు హీరోయిన్స్ పేర్లు కూడా నేరుగా మీడియాలో చెప్పింది.
అయితే ఈ వ్యవహారం బాలీవుడ్ లో మరోసారి రచ్చలేపింది.చాలా మంది హీరోయిన్లు ఈ విషయంలో అనురాగ్ కశ్యప్ కి మద్దతుగా నిలిచారు.అతను అలాంటి వ్యక్తి కాదని సర్టిఫికెట్స్ ఇచ్చేశారు.ఈ వ్యవహారంపై పోలీసు కేసు కూడా నమోదు అయ్యింది.
తనకి ప్రాణహాని ఉందని రక్షణ కావాలని నాయకులకి పాయల్ ఘోష్ విన్నవించుకుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ ఊహించని విధంగా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి రిపబ్లికన్ ఆఫ్ ఇండియా పార్టీలో చేరింది.
ఆ పార్టీ అధినేత రాందాస్ అధవలే సమక్షంలో పార్టీలో చేరింది.వెంటనే ఆమెని పార్టీ మహిళా వింగ్ కి ఉపాధ్యక్షురాలిని చేస్తూ రాందాస్ తీర్మానం చేశారు.
మొత్తానికి బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీలో చేరిన వెంటనే రాష్ట్ర నాయకురాలిగా పాయల్ ఘోష్ మారిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.