ఎన్టీఆర్‌ హీరోయిన్‌ క్షమాపణ చెప్పక తప్పలేదు

హీరోయిన్ పాయల్ ఘోష్ ఇటీవల బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.ఆ సందర్భంగా హీరోయిన్ రీచా చద్దా గురించి వ్యాఖ్యలు చేసింది.

 Payal Ghosh Apologise To Richa Chadha,payal Ghosh, Richa Chadha, Anurag Kashyap,-TeluguStop.com

తనకు రీచా చద్దతో సంబంధం ఉందని అనురాగ్‌ కశ్యప్‌ స్వయంగా నాతో అన్నాడు.రీచా చద్దా గురించి ఆయన మాట్లాడిన మాటలు అంటూ ఆమె గురించి అసభ్యంగా మాట్లాడింది.

ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రీచా ఆగ్రహం వ్యక్తం చేసింది.పాయల్‌ చేసిన మీటు వ్యాఖ్యల విషయంలో స్పందించని రీచా ఆ సందర్భంగా తన పేరును ప్రస్తావించడంపై అసహనం వ్యక్తం చేసింది.

దానికి గాను తాను పరువు నష్టం దావా వేస్తున్నట్లుగా కూడా ప్రకటించింది. 1.1 కోట్ల కు ముంబై కోర్టులో పరువు నష్టం దావా వేయడం జరిగింది.కోర్టు విచారణ సందర్భంగా పాయల్‌ ఘోష్‌ క్షమాపణ చెప్పింది.

నిన్నటి వరకు క్షమాపణ చెప్పేందుకు ససేమిరా అన్న హీరోయిన్ పాయల్ ఘోష్ నేడు కోర్టులో మాత్రం క్షమాపణ చెప్పేందుకు ఓకే చెప్పింది. క్షమాపణను స్వీకరిస్తున్నట్లుగా రీచా పేర్కొనడంతో ఈ కేసు సమస్య సమసి పోయినట్లు అయింది.

నిన్నటికి నిన్న తాను అన్నది నిజమే కనుక క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదంటూ పాయల్ ఘోష్ మీడియా ముందు మాట్లాడింది.ఒక్క రోజులోనే ఆమె మళ్ళీ మాట మార్చి ఓకే చెప్పింది క్షమాపణ చెప్పడంతో ఆమెపై ఉన్న పరువు నష్టం దావా వేస్తున్నట్లుగా కోర్టు ప్రకటించింది.

మరో వైపు ఆమె అనురాగ్‌ కశ్యప్‌ పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసు కోర్టులో నడుస్తుంది.ఆయన పై ఇప్పటికే ఆమె వేధింపుల ఆరోపణలు చేయడంతో పాటు ఫిర్యాదులు కూడా చేసింది.

ఆమె ఆ విచారణ నిమిత్తం కూడా కోర్టుకు హాజరవ్వాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube