టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులలో బాగా బిజీగా ఉన్నాడు.ఓవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో సమాన బాధ్యతలు చేపడుతున్నాడు.
ఇదిలా ఉంటే గతంలో కొన్ని రోజులు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పవన్ మళ్లీ రీ ఎంట్రీ తో అవకాశాలు అందుకుంటున్నాడు.ఇక పవన్ కి ఉన్న అభిమానులు కూడా పవన్ రీఎంట్రీ తో పైగా వరుస ప్రాజెక్టులతో అవకాశాలు అందుకునే సరికి తెగ సంతోషంగా ఉంటున్నారు.
ఇదిలా ఉంటే పవన్ ఓ అదిరిపోయే నిర్ణయాన్ని తీసుకున్నాడు.
ఒకప్పుడు పవన్ కేవలం ఏడాదికి ఒక సినిమాతో సరి పెట్టుకునేవాడు.
ఒక సినిమా తరువాత మరో సినిమాకు కూడా చాలా సమయాన్ని తీసుకునేవాడు.కానీ రీ ఎంట్రీ తో పాత పద్ధతులను వదిలేసాడు పవన్.
ఒక ఏడాదిలోనే వరుస సినిమాలు చేయడానికి రంగంలోకి దిగాడు.అంతేకాకుండా ఇచ్చిన సమయం వరకు షూటింగ్ ను కూడా పూర్తి చేయాలని స్పష్టం చేశాడట.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్.డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం లో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పన్ కోషియుమ్ రీమేక్ లో కూడా నటిస్తున్నాడు.అంతేకాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాకు సైన్ చేశాడట.
ఇక ఈ నేపథ్యంలో పవన్ ముగ్గులు దర్శకులకు 40 రోజులకు అటు ఇటు గా డేట్స్ ఇచ్చారట.
ఇక తాను ఇచ్చిన సమయం వరకు తన షూటింగ్ పూర్తి కావాలని, పైగా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత 3 నెలల్లో సినిమా కూడా విడుదల కావాలని ముందే దర్శక నిర్మాతలకు తెలుపుతున్నాడట పవన్.ఇదిలా ఉంటే మరో డైరెక్టర్ రమేష్ వర్మ తో కూడా మరో సినిమా చేయనున్నాడు పవన్.