పార్టీ కట్టుబాట్లు దాటి మరీ వ్యవహరిస్తూ పార్టీకి తల ఒంపులు తీసుకొస్తున్న రాజోలు జనసేన ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్ వ్యవహారం ఆ పార్టీకి తలనొప్పులు తీసుకొస్తోంది.జనసేన పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్యెల్యేగా రాపాకకు మొదట్లో మంచి గుర్తింపు ఉండేది.
అయితే క్రమ క్రమంగా ఆయన వైసీపీ వైపు మొగ్గుచూపిస్తూ ఆ పార్టీ అధినేత జగన్ ను పొగుడుతుండడంతో ఆయన్ను దూరం పెడుతూ వస్తున్నారు.తాజాగా ఆయన మీద జనసేన చర్యలు తీసుకునేందుకు షోకాజ్ నోటీసు ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు కూడా చేస్తున్నారు.అయితే రాపాక మాత్రం అసెంబ్లీ సమావేశాల్లో ఇంగ్లీష్ మీడియంను స్వాగతిస్తున్నారు.
ఉరుకులూ పరుగుల జీవితంతో ప్రతీ ఒక్కరికి ఇంగ్లీష్ అవసరమని అన్నారు.అందుకే తాను ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వగతిస్తున్నానని చెప్పడమే కాకుండా జగన్ పై ప్రశంశలు కురిపించారు.
ఈ నేపథ్యంలోనే ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది.అయితే ఇదంతా వట్టిదే అని, తాము ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు అంటూ జనసేన ప్రకటన విడుదల చేసింది.