అల్లు అర్జున్, త్రివిక్రమ్ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరవుతాడని మెగా ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూశారు.అయితే పవన్ రాకుండానే సత్యమూర్తి ఆడియో విడుదల అయ్యింది.
తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.సత్యమూర్తి మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకు పోతున్నాడు.
దాంతో ఈ సినిమా సక్సెస్ను పురస్కరించుకుని ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ ఒక వేడుక నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ను తీసుకు వచ్చేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
మొదట ఈ థ్యాంక్స్ మీట్ను ఈనెల 18న నిర్వహించాలని భావించారు.అయితే పవన్కు వీలు పడదనే ఉద్దేశ్యంతో డేట్ను మార్చినట్లుగా తెలుస్తోంది.
కొత్త డేట్ను పవన్ను సంప్రదించి, ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ప్రకటించాలని దర్శకుడు త్రివిక్రమ్ ఎదురు చూస్తున్నాడు.వారం రోజుల్లోనే ఈ థ్యాంక్స్ మీట్ ఉండే అవకాశాలు ఉంటాయి అని మాత్రం తెలుస్తోంది.
ఈసారి అయినా పవన్ కళ్యాణ్ వస్తాడా అని మెగా ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాన్స్ను సంతోష పెట్టేందుకు పవన్ను తీసుకు రావాలని బన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.