పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ను తెలుగులో రీమేక్ చేస్తున్న పవన్, ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్కు రెడీ చేస్తు్న్నాడు.
‘వకీల్ సాబ్’ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ క్రేజ్ను దక్కించుకుంది.
కాగా తొలుత ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు.
కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.ఇక ఈ సినిమాను ఆగష్టు 14న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
అయితే అదే రోజున మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది.కానీ ఆ సినిమా కూడా కరోనా ప్రభావంతో వాయిదా పడుతుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.
మరి ఆచార్య డేట్కు వకీల్ సాబ్ వస్తే, ఆచార్య సినిమా ఎప్పుడు వస్తుందనే ప్రశ్న ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.కాగా ఈ వార్తకు సంబంధించి చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.