వందమంది బాంబులతో వస్తే.. నేను ఎదురు వెళ్తా.. పవన్ సంచలన వ్యాఖ్యలు..!!

అనంతపురం జిల్లా నల్లచెరువు లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బహిరంగసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.

 Pawan Sensatational Comments In Ananthapur, Pawan Kalyan, Ananthapur, Janasena ,-TeluguStop.com

వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీని ఆచరించండి అని.ప్రజలకు పిలుపునిచ్చారు.పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని కుటుంబాన్ని కూడా పక్కనపెట్టి రాజకీయాల్లోకి రావడం జరిగింది అని స్పష్టం చేశారు.జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా గానీ రాజకీయాల్లోనే కొనసాగుతానని పేర్కొన్నారు.

ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావడం గ్యారెంటీ అని పవన్ జోస్యం చెప్పారు.రాయలసీమ ప్రాంత ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని.ఈ  నెలలో  పౌరుషం ఉందని, అందరూ ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యల గురించి ప్రశ్నిస్తే రాజకీయ నాయకులలో ఉండే పెద్ద వాళ్ళు చంపేస్తారేమో.

అనే భయాలు ఉంటాయి.కానీ రాయలసీమ పోరాట గడ్డ అని స్పష్టం చేశారు.

మీ గురించి మీకు అర్థం కావటం లేదు.ఉదాహరణకి 100 మంది బాంబులతో వచ్చారు.

అనుకోండి వాళ్లకు నేను ఎదురు వెళ్తా.ఇది ప్రజాస్వామ్యం అని చెప్పుకొచ్చారు.

ప్రభుత్వాలు తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం అని పవన్ పేర్కొన్నారు.ప్రజాస్వామ్యంలో భయానికి తావులేదని.

జనసేన ప్రభుత్వం ఏర్పడితే రాయలసీమ లో.అభివృద్ధి ఖచ్చితంగా తీసుకొస్తామని యువత ఉద్యోగాల కోసం చదువుల కోసం బయట ప్రాంతాలకు వెళ్ళకుండా చేస్తానని.స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube