కోలీవుడ్లో హీరోలు నిర్మాతల నష్టాలను భరించారు అనే వార్తలు మనం చాలా సార్లు చూశాం.అదే విధంగా టాలీవుడ్లో ఒక్కరు ఇద్దరు స్టార్స్ నిర్మాతల నష్టాలను భరిస్తూ ఉంటారు.
పవన్ కళ్యాణ్ కూడా తన నిర్మాతలకు భరోసాగా నిలుస్తూ ఉంటాడు.తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేక పోతుంది.
దాంతో నిర్మాత శరత్ మారార్కు భారీ నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.శరత్ మారార్తో పాటు సునీల్ లుల్లా కూడా సర్దార్ వల్ల తీవ్రంగా నష్టపోయినట్లుగా తెలుస్తోంది.
ఈ నష్టాన్ని భరించాలని పవన్ నిర్ణయించుకున్నాడు.
సర్దార్ చిత్రాన్ని నిర్మించింది పవన్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న శరత్ మారార్ అనే విషయం తెల్సిందే.
పూర్తి స్థాయి నిర్మాతగా శరత్ మారార్ నిర్మించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం.మొదటి సినిమాతోనే భారీ నష్టాలు రావడంతో మిత్రుడికి సాయం చేసేందుకు పవన్ ముందుకు వచ్చాడు.
తన తర్వాత సినిమాను కూడా శరత్ మారార్ నిర్మాణంలో చేయాలని నిర్ణయించుకున్నాడు.ఇదే నెలలో పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్జే సూర్య దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నాడు.
ఆ సినిమా నిర్మాణంను శరత్ మారార్ చూడనున్నాడు.ఈ సినిమాకు పవన్ పారితోషికం తీసుకోకుండా షేర్ మాత్రం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
దాంతో శరత్ మారార్కు న్యాయం చేసినట్లు అవుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు.