ఏ పార్టీలోనూ లేనటువంటి విచిత్రమైన పరిస్థితి జనసేన పార్టీలో కనిపిస్తోంది.ఆ పార్టీ అధినేత పవన్ వైసీపీని విమర్శించడంలో వెనుకా ముందు ఆలోచించకుండా విమర్శలు చేస్తున్నారు.
జగన్ టార్గెట్ గా చేసుకుని పవన్ పర్యటనలు కూడా చేస్తున్నాడు.అంతే కాదు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కాకినాడలో రైతుల కోసం ధర్నా కార్యక్రమాన్ని కూడా పవన్ ఏర్పాటు చేసుకున్నాడు.
అంతే కాదు జగన్ ను టార్గెట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కూడా పెడుతున్నారు.అయితే ఆ పార్టీ నుంచి గెలిచినా ఏకైక ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
అసెంబ్లీ బయట, లోపల జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ జగన్ ను పొగతాలతో ముంచెత్తుతున్నాడు.ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై రాపాక జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు.
టీడీపీ హయాంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించారని, కానీ మధ్యలోనే వదిలేశారన్నారు.
ఇప్పుడు కొత్త ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం మంచి నిర్ణయం తీసుకున్నారని దీనిని వ్యతిరేకించడం మంచి పద్దతి కాదని రాపాక సూచించారు.
ఒకవైపు జనసేన అధినేత విమర్శలు చేస్తుంటే ఆ పార్టీ ఏకైక ఎమ్యెల్యే జగన్ ను పొగడడం ఆ పార్టీలో ఉన్న గందరగోళాన్ని తెలియజేస్తోంది.