గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని , ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతామని, కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది .పెద్దగా బలం లేని చోట పవన్ ఏ దైర్యం తో పోటీ చేయాలనుకుంటున్నారు అనే విషయం ఎవరికీ అంతుపట్టలేదు.
ఏపీలో జనసేన ,బీజేపీ పొత్తు కొనసాగుతున్న సమయంలో, పవన్ గ్రేటర్ లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడం అందరిని మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.బీజేపీ సైతం ఈ వ్యవహారంతో ఇబ్బంది పడినట్లుగానే కనిపించింది.
అయితే నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి రోజైన నిన్న అకస్మాత్తుగా గ్రేటర్ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, పూర్తిగా జనసేన బీజేపీకి మద్దతు ఇస్తుందని, ఇప్పటికే పార్టీ తరఫున నామినేషన్ వేసిన వెంటనే ఉపసంహరించుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.అంతేకాదు బీజేపీ కి విజయాన్ని చేకూర్చే విషయంలో అంతా భాగస్వామ్యం అవ్వలని, పవన్ పిలుపునివ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని విస్మయాన్ని కలిగించింది.
ఇప్పటికే జనసేన భవిష్యత్తుపై అందరికీ నీలినీడలు కమ్ముకుంటున్న సమయంలో, పవన్ నిలకడ లేని మనస్తత్వం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సమయంలో, పవన్ ఈ నిర్ణయం తీసుకోవడం పెద్ద సాహసమే అని చెప్పాలి.అయితే పవన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా ముందు చూపు ఉన్నట్టు గానే అర్థం అవుతుంది.
ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసినా, ఒక్క స్థానం కూడా దక్కించుకునే అవకాశం లేదనే విషయం బాగా తెలుసు.పోటీ చేస్తామని ముందు ఉత్సాహంగా ప్రకటించినా, ఆ తర్వాత పవన్ ఆ తరువాత తలెత్తబోయే పరిస్థితులను లెక్కలోకి తీసుకుని పోటీ నుంచి తప్పుకున్నట్లు గా అర్ధం అవుతుంది.
ఇక్కడ గెలిచే అవకాశం లేకపోవడంతోనే బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టుగా అర్థమవుతోంది.
మొన్నటి దుబ్బాక ఉప ఎన్నికలలో బీజేపీ కి విజయం దక్కడంతో, మంచి జోష్ లో ఉంది.గ్రేటర్ లో బీజేపీ ఊహించని ఫలితాలు వస్తాయని, వివిధ సర్వే రిపోర్టులు బయటకు రావడం, ఇలా అన్నిటిని లెక్కలోకి తీసుకున్నట్లుగా కనిపిస్తున్నారు.అలాగే ఇక్కడ త్యాగం చేయడం ద్వారా ఏపీలో బీజేపీ తమకు మరింత ప్రాధాన్యం బీజేపీ ఇస్తుందని, కేంద్ర బీజేపీ పెద్దలు మరింతగా తమను గుర్తిస్తారనే అభిప్రాయం పవన్ లో ఉన్నట్టు కనిపిస్తోంది.
అందుకే విమర్శలు ఫాలో అవుతాను అని తెలిసినా, పవన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తున్నారు.