పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ ఫుల్ బిజీగా ఉన్నాడు.ఈయన ఒకవైపు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చేస్తున్న విషయం విదితమే.
ఈ సినిమాను పూర్తి చేయకుండానే వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు.సినిమాలు అయితే ప్రకటిస్తున్నాడు కానీ వాటిని పూర్తి చేయడంలో మాత్రం విఫలం అవుతున్నారు.
అందుకే ఫ్యాన్స్ మాత్రం ఒక్క సినిమా అయిన పూర్తి చేయమని ఆయనను కోరుతున్నారు.
వీరమల్లు సినిమా షూట్ రెండేళ్ల క్రితమే స్టార్ట్ చేసిన ఇప్పటికి పూర్తి చేయలేదు.
ఇది పూర్తి కాకుండానే పవన్ కళ్యాణ్ మరిన్ని సినిమాలను అధికారికంగా ప్రకటించాడు.పవన్ ప్రకటించిన సినిమాల్లో సాహో డైరెక్టర్ సుజీత్ కూడా ఉన్నాడు.
సుజీత్ ప్రభాస్ తో సాహో సినిమా తీసిన విషయం తెలిసిందే.ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ సుజీత్ కు ఉన్న టాలెంట్ కు మంచి మార్కులు పడ్డాయి.
మరి ఈ యంగ్ టాలెంట్ కు పవర్ స్టార్ కూడా ఒక అవకాశం ఇచ్చాడు.పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సుజీత్ ఉపయోగించుకుని హిట్ అందుకుంటే ఇక ఈయన కూడా స్టార్ డైరెక్టర్ అయిపోవడం ఖాయం.ఇదిలా ఉండగా ఈ మధ్యనే సుజీత్-పవన్ సినిమాను లాంఛనంగా స్టార్ట్ చేసారు.పూజా కార్యక్రమాలతో మేకర్స్ ఈ సినిమాను స్టార్ట్ చేసినప్పటి నుండి ‘ఓజీ’ సినిమాపై ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.
ఇప్పటికే పవన్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తేరీ సినిమాకు రీమేక్ అనే విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు ఓజీ కూడా రీమేక్ అని వార్తలు వస్తున్నాయి.ఇది కూడా తమిళ్ సూపర్ హిట్ సినిమాకు రీమేక్ అని టాక్ వస్తుంది.మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ సినిమా కూడా రీమేక్ అని ఫిక్స్ అయితే పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందడం ఖాయం.
చూడాలి అఫిషియల్ గా ప్రకటన వస్తే కానీ ఇది నిజం అని నమ్మలేం!
.