పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఎట్టకేలకు గుర్తింపు లభించింది.జన సేన పార్టీ కి రాజకీయ పార్టీగా తెలంగాణ ఎన్నికల కమిషన్ గుర్తింపునిచ్చింది.
జనసేన పార్టీని రిజిస్ట్రర్ చేసినట్లు తెలంగాణ ఎన్నికల సంఘం బుధవారం అధికారికంగా ప్రకటించింది.
జనసేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలంటూ పవన్ కల్యాణ్ గతంలో దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే పవన్ పార్టీకి గుర్తింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే టీడిపి, కాంగ్రెస్ లాగా ‘ప్రత్యేక గుర్తు లేని’ రాజకీయ పార్టీగా జనసేన వుండబోతోంది.
ఎన్నికల్లో పోటీ చేసి చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు, ఓట్లు సంపాదిస్తే భవిష్యత్తులో ప్రత్యేక గుర్తు గల రాజకీయ పార్టీగా జనసేనకు గుర్తింపు లభించే అవకాశముంది.
పార్టీ కు గుర్తింపు వచ్చిన నేపథ్యంలో త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొలిటికల్ పార్టీగా జనసేన బరిలో దిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు .వరంగల్ ఉప ఎన్నిక, నారాయణ్ఖేడ్ ఉప ఎన్నిక లలో కూడా జన సేన పోటీ చేయాలని పవన్ ఫాన్స్ కోరుతున్నారు .గతంలోనే పవన్కల్యాణ్ సూచనప్రాయంగా ఈ అంశాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే