ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ రెండవ తారీకు అనగా గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ శ్రమదానం కార్యక్రమం చేయడానికి రెడీ అయింది.ఈ సందర్భంగా 175 నియోజకవర్గాల్లో.
రోడ్ల మరమ్మతుల కార్యక్రమం విషయంలో శ్రమదానం చేపట్టాలని ఆ పార్టీ కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది.ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాలలో శ్రమదానం కార్యక్రమం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
ఎప్పటి నుండో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నట్లు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ విషయం పై పవన్ కళ్యాణ్ రెండుసార్లు స్పందించడం జరిగింది.
అయితే మరోపక్క వర్షాలు కురుస్తుండటంతో ఇటువంటి టైం లో.రోడ్డు మరమ్మతులు చేయడం భావ్యం కాదని.వర్షాలు తగ్గిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు కార్యక్రమాలు ప్రభుత్వం చేయనున్నట్లు అధికార పార్టీ నాయకులు తెలుపుతున్నారు.పరిస్థితి ఇలా ఉంటే.అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా.రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు.
రోడ్ల మరమ్మతు కార్యక్రమాన్ని శ్రమదానం పేరిట నిర్వహించడానికి రెడీ అయ్యారు.