పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ తన సినిమాలతో బిజీగా ఉన్నారు.ఈయన చేస్తున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది.
కానీ ఎప్పుడు పూర్తి అవుతాయి అన్న విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ ఏడాది వెండితెర మీద తమ స్టార్ హీరోను చూస్తామో లేదో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ తన మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు తో బిజీగా ఉన్నారు.ఈ సినిమా షూట్ ప్రెజెంట్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది అని టాక్.
ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమా గత రెండేళ్లుగా సెట్స్ మీదనే ఉంది.
ప్రెజెంట్ శరవేగంగా షూట్ జరుపు కుంటుంది.
ఈ సినిమా చేస్తూనే పవన్ కళ్యాణ్ మరొక కొత్త సినిమాను ప్రకటించాడు. హరిహర వీరమల్లు తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ఇటీవలే ప్రకటించాడు.అలాగే సుజీత్ దర్శకత్వంలో కూడా మరొక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.
చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నప్పటికీ ఈ ఏడాది ఒక్క సినిమా అయినా రిలీజ్ అవుతుందో లేదో అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆందోళన చెందుతున్నారు.
దీనికి తోడు వస్తున్న రూమర్స్ ఈ భయాన్ని మరింత ఎక్కువ చేస్తున్నాయి.ఇక తాజాగా వస్తున్న రూమర్ తో ఈ ఏడాది ఒక్క సినిమా రావడం కూడా కష్టమే అంటున్నారు.వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడమే ద్యేయంగా పెట్టుకున్న పవన్ ఇందుకోసం రెడీ అవుతున్నాడు.
త్వరలోనే ఎన్నికల ప్రచారానికి పవన్ సిద్ధం అవుతున్నారని.ఫిబ్రవరి ఫస్ట్ వరకే డేట్స్ ఇచ్చి నిర్మాతలకు అందుబాటులో ఉండనున్నాడని.ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కోసం వెళ్లనున్నాడని తిరిగి ఎలెక్షన్ తర్వాతనే ఈయన అందుబాటులో ఉండబోతున్నాడని టాక్.మరి సినిమాల పరిస్థితి ఏంటో చూడాలి.