పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో రీఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం వకీల్ సాబ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ బ్లాక్బస్టర్ను అందుకునేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.
కాగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్గా ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో రెచ్చిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు.
కాగా ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.దీంతో కరోనా పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించాలని పవన్ భావిస్తున్నాడు.అయితే కరోనా పరిస్థితులు పవన్ సినీ జీవితాన్నే కాకుండా రాజకీయ జీవితాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయట.2024లో ఎన్నికలకు సిద్ధంగా ఉండేందుకు 2022 చివరి నాటికి సినిమాలను ముగించేయాలని ఆయన అనుకున్నాడు.కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, 2022 చివరి నాటికి సినిమాలను పూర్తి చేస్తారా లేదా అనే సందేహం నెలకొంది.
దీంతో పవన్కు ఇప్పట్నుండే టెన్షన్ మొదలైందని, అందుకే ఆయన ఇటీవల దీక్ష తీసుకున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ వినిపిస్తుంది.
మరి నిజంగానే పవన్ కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా టెన్షన్ పడుతున్నాడా అనే విషయం తెలియాల్సి ఉంది.ఇక వకీల్ సాబ్ తరువాత దర్శకుడు క్రిష్తోనూ ఓ సినిమా చేసేందుకు పవన్ రెడీ అయ్యాడు.
ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.