తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ చేపట్టిన శ్రమదానం కార్యక్రమంలో.వైసిపి నాయకులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అనవసరంగా నన్ను కెలికారు, మానసికంగా నా మీద ఎన్నో దాడులు చేయించారు.అయినా కానీ ఎక్కడా నేను నోరు జార లేదు.
కొంత మంది చేత బూతులు కూడా తిట్టించారు.మానసికంగా నా మీద ఎన్నో అత్యాచారాలు చాలాసార్లు చేశారు ఇప్పటి వరకు పడ్డ ఇంకా పడేది లేదు.
ఒక్కొక్కడిని కింద కూర్చోపెట్టి తోలు తీసి.నార తీసి చీల్చి చెండాడుతూ అని తెలిపారు.
మర్యాదగా ఉన్నంత కాలం చాలా మంచిగా ఉన్న, నా సహనాన్ని .పిరికితనం చేతగానితనం అని భావించకండి.తొక్కి ఒక్కొక్కడి నారా తీస్తా.అంటూ పవన్ సీరియస్ అయ్యారు. యాక్షన్ కెమెరా స్టార్ట్.అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని చెప్పుకొచ్చారు.
వైసీపీ పార్టీలో ఆయనకు నా గురించి బాగా తెలుసు అని, ఆయన కూడా ఈ విధంగా మాట్లాడటం అన్యాయమని అన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుందని.
ప్రశ్నించ బట్టే బ్యారేజీపై రాత్రికి రాత్రి.గుంతల పుడ్చారని చెప్పుకొచ్చారు.
ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయని.మరి ఎందుకు పనిచేయడం లేదని విమర్శించారు.