నటుడిగా తెరంగేట్రం చేసిన బండ్ల గణేష్ కొంత కాలంలోనే స్టార్ నిర్మాతగా మారిపోయాడు.పవన్ కళ్యాణ్ దయవల్ల నిర్మాతగా పరిచయమైనా బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసినా బండ్ల గణేష్ కొన్నింటిని వల్ల భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.ఆ కారణంగా గత మూడు నాలుగు సంవత్సరాలుగా బండ్ల గణేష్ కొత్త సినిమాలు ఏవి నిర్మించలేదు.
ఆర్థిక పరిస్థితి బాగా లేని కారణంగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో కామెడియన్గా కూడా నటించాడు.మళ్లీ నిర్మాతగా మారెందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బండ్ల గణేష్ కి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పాడు అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి.
బండ్ల గణేష్ స్వయంగా ట్విట్టర్ లో ఓకే అన్నాడు అంటూ ట్వీట్ చేయడం వల్ల ఆ విషయం మీడియాలో వైరల్ అయింది.ఇద్దరి కాంబోలో 2022 లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా భావించారు.
కానీ ఇప్పుడు సినిమా ఉందా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది.ఎందుకంటే ఈ సారి బండ్ల గణేష్ ట్వీట్ అనుమానాలకు తావిస్తుంది.
తన వీపున కొట్టండి పర్వాలేదు కానీ పొట్ట మీద కొట్టకండి అంటూ మీడియా వారిని ఉద్దేశించి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు నెటిజెన్స్ వివిధ రకాలుగా ఊహించుకుంటున్నారు. బండ్ల గణేష్ పవన్ తో సినిమా విషయంలో అలా ఇలా అంటూ మీడియాలో వార్తలు వస్తున్న కారణంగా సున్నితంగా బండ్ల గణేష్ ను పవన్ కళ్యాణ్ సున్నితంగా హెచ్చరించాడంటున్నారు.
డేట్లు ఇవ్వకుండానే ఎలా ప్రచారం చేసుకుంటావు అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశాడట.తాను చూద్దాం అన్నందుకే ఇంతగా ఎలా నువ్వు రచ్చ చేస్తావంటూ విమర్శలు గుప్పించాడట.
ఆ కారణంగానే ప్రాజెక్టు గురించి ఇప్పటి వరకు వస్తున్న వార్తలను ఆపేయండి అంటూ బండ్ల గణేష్ విజ్ఞప్తి చేశాడు.పవన్ కళ్యాణ్ డేట్లు ఇవ్వక ముందే ట్వీట్ చేయడంతో మొదటికే మోసం వచ్చింది.
బండ్ల గణేష్ నోటిదూల కారణంగా చేతి వరకు వచ్చిన ప్రాజెక్టు చేజారి పోయినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అసలు విషయం ఏంటి అనేది బండ్ల గణేష్ మరింత స్పష్టత క్లారిటీ ఇస్తే కానీ అర్థం అవ్వదు.