జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ పై స్పందించారు.వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 2.30 లక్షల ఉద్యోగాలకు హామీ ఇచ్చారని.అధికారంలోకి వచ్చాక ఆ హామీని గాలికొదిలేశారని మండిపడ్డారు.2.30 లక్షల ఉద్యోగాలకు హామీ ఇచ్చి.ఇప్పుడు కేవలం 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ చూపించడం ఖచ్చితంగా యువతను మోసం చేయడమే అని అంటున్నారు.ఎన్నికల టైంలో లక్షల లో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారని .ప్రభుత్వం ఇటీవల రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ .నిరుద్యోగులను ఎంతగానో నిరాశకు గురి చేసిందని మండిపడ్డారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.ఈనెల 20వ తారీఖున ఆందోళనలకు దిగుతామని నిరుద్యోగులకు అండగా ఉండి జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఎక్చేంజిలలో కార్యాలయాల్లో వినతిపత్రాలు.
అందజేస్తామని స్పష్టం చేశారు.ఇటీవల ప్రభుత్వం వెళ్లి చేసిన క్యాలెండర్ మార్చి మరొక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని తెలిపారు.
అంతేకాకుండా ఇటీవల రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ మళ్లీ పునర్ సమీక్షించాలని, ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను గుర్తించి .కొత్త జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని అప్పుడే నిరుద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేసినట్లు అవుతుందని పవన్ స్పష్టం చేశారు.