టాలీవుడ్ లో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నటువంటి “వకీల్ సాబ్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఇటీవల కాలంలోనే ఈ చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయగా ఈ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మరో దర్శకుడికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే అప్పట్లో గబ్బర్ సింగ్ చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి హరీష్ శంకర్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
అంతేగాక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.దీంతో మరోసారి ఈ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ హిట్ కొట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేకాక దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ చిత్రానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం.అయితే ఇందులో హీరోయిన్ గా గబ్బర్ సింగ్ చిత్రంలో నటించినటువంటి శృతి హాసన్ ని మళ్లీ రిపీట్ చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ అనుకుంటున్నట్లు సమాచారం.
అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ తో గతంలో శృతిహాసన్ “కాటంరాయుడు” అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రం తర్వాత దాదాపుగా మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఇటీవలే శృతి హాసన్ తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న “క్రాక్” అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్నాడు.