సైదాబాద్ చిన్నారి అత్యాచార ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.సెప్టెంబర్ 12 వ తారీఖున జరిగిన ఈ ఘటన అనేక మంది సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులను కలిచి వేసింది.
రాజు అని కఠినంగా శిక్షించాలని పలు రాజకీయ పార్టీలతో పాటు సెలబ్రిటీలు కూడా వేడుకుంటున్నారు.కొద్ది గంటల క్రితం పవన్ కళ్యాణ్ సైదాబాద్ చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.
జరిగిన దుర్ఘటన అతన్ని ఎంతగానో కలిచివేసింది అని పేర్కొన్నారు.
న్యాయం జరిగే వరకు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అంతేకాకుండా అందరం సిగ్గుతో తలదించుకోవలసిన సంఘటన ఇది అంటూ మీడియా ముందు పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.మీడియా కూడా ఈ విషయంలో అలర్ట్ గా ఉండాలని కుటుంబానికి న్యాయం జరిగేలా అండగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు.
ఆరేళ్ల చిన్నారిపై సభ్యసమాజం తలదించుకునేలా ఇంత దారుణంగా అత్యాచారం చేయడం .ఖండించాల్సీన్న విషయమని కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని పవన్ పేర్కొన్నారు. సైదాబాద్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఇంకా చాలా రాజకీయ పార్టీల నేతలు.వస్తూ ఉన్నారు.దీంతో ఈ కేసును తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని రేపు ఉదయం కల్లా నిందితుడు రాజుని పట్టుకుంటామని అంటున్నారు.