టాలీవుడ్ పవర్ స్టార్ నుండి రాజకీయ జనసేన అధిపతి గా మారిన పవన్ కళ్యాణ్ గురించి మనకు తెలిసిందే.ఆయన సినీ పరిశ్రమలో ఎంత అభిమానాన్ని సంపాదించుకున్నారో.
రాజకీయ పరంగా కూడా అంతకంటే ఎక్కువ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.కాగా ఇటీవలే పవన్ కళ్యాణ్ శ్రీవారిని దర్శించుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నటనతో ఎంతో గుర్తింపు పొందిన ఆయన.రాజకీయ పరంగా కూడా అంతే గుర్తింపు వస్తుందని సినిమాలను దూరం పెట్టి రాజకీయాల్లో చేరాడు.అంతేకాకుండా ఆయన ప్రత్యేకంగా పార్టీని పెట్టుకోగా దానికి జనసేన అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ బాగా దైవ దర్శనాలు చేస్తుంటారు.
కొన్ని నెలల క్రితం కొండగట్టు హనుమాన్ టెంపుల్ ని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్.కాగా ఇటీవలే తిరుమల వెంకటేశ్వర స్వామి ను దర్శించుకున్నారు.
కాగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి వెళ్లారు.పూజారులతోనీ ప్రత్యేక పూజలు చేయించుకుని.ఈ విధంగా మీడియాతో మాట్లాడుతూ “శ్రీవారిని దర్శించుకోవడానికి చాలా రోజులైందని, అంతేకాకుండా కరోనా సమయంలో రాలేకపోయానని” తెలిపారు.“స్వామివారి ఆశీస్సులు ఈ రోజు అందాయని తెలిపారు.ప్రస్తుతం రాజకీయ అంశాల గురించి తిరుపతిలో మాట్లాడతానని ప్రస్తుతం తిరుమలలో వద్దని” తెలిపారు.కాగా పవన్ కళ్యాణ్ రాకతో తిరుమలలో మొత్తం తన అభిమానులు జై జనసేన అంటూ పిలుపునిస్తున్నారు.
చాలా వరకు అక్కడ ట్రాఫిక్ గా మారింది.
ఇక సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న వకీల్ సాబ్ సినిమాలో నటించగా టీజర్ కూడా విడుదలైంది.ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.