పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా తరువాత పవన్ తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియయల్గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ను చిత్ర యూనిట్ పెట్టాలని అనుకుంటోంది.ఇక ఈ సినిమాకు సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తున్నాడు.దీంతో కీరవాణి సెంటిమెంట్ ఈ సినిమాకు ఖచ్చితంగా కలిసొస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.గతంలో మెగాస్టార్ చిరంజీవికి ‘ఘరానా మొగుడు’, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ‘మగధీర’ వంటి సినిమాలకు సంగీతం అందించడంతో ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచాయి.
దీంతో ఇప్పుడు విరూపాక్ష సినిమాకు కీరవాణి సంగీతం ఖచ్చితంగా అదిరిపోతుందని ప్రేక్షకులు అంటున్నారు.
ఇక ఈ సినిమాలో పవన్ రాబిన్హుడ్ తరహా పాత్రలో నటించనున్నాడు.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్ హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ఈ సినిమాను తమిళ స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.