పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ సినిమ లతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను దక్కించుకున్న విషయం తెల్సిందే.రికార్డ్ బ్రేకింగ్ వసూళ్ల ను ఆ రెండు సినిమా లు దక్కించుకున్న నేపథ్యం లో పవన్ మళ్లీ అదే సెంటిమెంట్ ను ప్రయోగించబోతున్నాడు.
వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ సినిమా లు రీమేక్ అనే విషయం తెల్సిందే.ఒకటి హిందీ సినిమా కు రీమేక్ కాగా ఒకటి మలయాళ సినిమా కు రీమేక్.
పవన్ బ్యాక్ టు బ్యాక్ రీమేక్ లతో హిట్ ను అందుకున్నాడు.కనుక వెంటనే మరో రీమేక్ ను చేయాలని భావించాడు.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలు అయ్యాయి.ఈసారి తమిళ సినిమా వినోదయ్య సిత్తం ను రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.
ఒరిజినల్ వర్షన్ కు దర్శకత్వం వహించిన సముద్రఖని ఈ సినిమా కు రీమేక్ చేయబోతున్నాడు.ఈ రీమేక్ లో పవన్ కళ్యాన్ తో పాటు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించడం ఇంట్రెస్టింగ్ విషయం.
మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటీ అంటే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజుల వర్కింగ్ డేస్ ను మాత్రమే ఇవ్వబోతున్నాడు.ప్రమోషన్ కోసం మరో మూడు నాలుగు రోజుల సమయం ఇస్తాడట.
ఇందుకు గాను సదరు నిర్మాతలు ఏకంగా 60 కోట్ల రూపాయలను పవన్ కు ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా ను పవన్ కోసం సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు.
ఇందుకు గాను ఆయన పారితోషికం తీసుకోవడం లేదట.ఆయన పారితోషికం కూడా పవన్ అకౌంట్ కు వెళ్తుంది అనేది టాక్.
మొత్తానికి సినిమా గురించిన ఈ మూడు విషయాలు ప్రస్తుతం సదరు రీమేక్ పై అంచనాలు భారీగా పెంచేస్తున్నాయి.కేవలం రెండు నెలల గ్యాప్ లో సినిమా ను పూర్తి చేసి విడుదలకు సిద్దం చేస్తారట.
ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరిగిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు సర్వం సిద్దం.ఆగస్టు లోనే షూటింగ్ పూర్తి చేసేలా పవన్ డేట్లు ఇచ్చాడట.