పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ సినిమాలకు కొద్దిగా బ్రేక్ ఇచ్చి రాజకీయాలపై ద్రుష్టి పెట్టాడు.సినిమాలు చేస్తూనే పాలిటిక్స్ కూడా చూసుకుంటూ రెండు వైపులా బిజీ బిజీగా గడుపు తున్నాడు.
ప్రెజెంట్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన టూర్ కోసం రెడీ చేసుకున్న ‘వారాహి‘ వాహనంపై విజయవాడ వెళ్లి వచ్చారు.అక్కడికి పవర్ స్టార్ వస్తున్నట్టు తెలుసుకున్న వారంతా ఎగబడి మరీ ఈయనను చూసేందుకు వెళ్లారు.
అభిమానులు భారీ సంఖ్యలో రావడంతో పవన్ స్టార్ కూడా ఫ్యాన్స్ కు స్పదించారు.ఇక ఇక్కడ పవన్ తన వారాహి వాహనం మీద దిగిన ఫోటో నెట్టింట మంచి వైరల్ గా మారింది.
తన వారాహి పై పవన్ కళ్యాణ్ గదాదండం పట్టుకుని దిగిన పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ లో ఓంకారం కూడా కనిపించడం ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి కలిగేలా చేసింది.
ఇక ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత పవన్ వినోదయ సీతం షూటింగ్ లో పాల్గొన బోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ తో పాటు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలు మాత్రమే మరిన్ని సినిమాలను కూడా లైన్లో పెట్టాడు.
ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు చివరి దశకు చేరుకుంది.ఈ సినిమా షూట్ పూర్తి కాకుండానే మరిన్ని సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు.హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ప్రకటించిన విషయం విదితమే.
ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో హరీష్ శంకర్ బిజీగా ఉన్నారు.అలాగే సుజీత్ తో కూడా సినిమా చేస్తున్నట్టు అధికారిక ప్రకటన అయితే వచ్చేసింది.